Chandrababu: టీడీపీని ఆ పార్టీ నేతలు వీడడానికి ప్రధాన కారణం ఇదే: కన్నా లక్ష్మీనారాయణ

  • బాబు నాయకత్వంపై టీడీపీ నేతలు విసిగిపోయారు  
  • బాబు విధానాలు, నిర్ణయాలు నచ్చక బీజేపీలో చేరిక 
  • అంతేతప్ప, మేమెవరినీ బలవంతంగా చేర్చుకోవట్లేదు

ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసంతో, చంద్రబాబునాయుడి నాయకత్వంపై విసిగిపోవడం వల్లే టీడీపీ నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీని ఆ పార్టీ నేతలు వీడడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని, ఆయన విధానాలు, తీసుకున్న నిర్ణయాలేనని అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లుగా కేంద్రంతో లబ్ధి పొంది, ఆ తర్వాత మోదీపై చంద్రబాబు దుష్ప్రచారం చేయడం నచ్చని టీడీపీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకొచ్చేస్తున్నారని అన్నారు. అంతే తప్ప, తామెవరినీ బలవంతంగా బీజేపీలో చేర్చుకోవడం లేదని స్పష్టం చేశారు.

More Telugu News