Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బూతుపురాణం.. ఆడియో రిలీజ్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్!

  • ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది
  • జర్నలిస్టులనే బెదిరిస్తున్నారు
  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాక్షస రాజ్యం నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును బెదిరిస్తున్నారని లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతి ఏంటో ఊహించుకోవాలని పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ ఆడియోను కుటుంబ సభ్యులతో కలిసి వినొద్దనీ, ఇందులో అసభ్య పదజాలం ఉందని సూచించారు. ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News