chardham: చార్‌ధామ్‌ యాత్రలో అపశ్రుతి... కర్నూల్‌ జిల్లాకు చెందిన భక్తురాలి మృతి

  • యమునోత్రిలో కన్నుమూసిన కోడుమూరుకు చెందిన ధర్మాంబ
  • శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో కన్నుమూత
  • శివరాముడు ట్రావెల్స్‌ ద్వారా టూర్‌ వెళ్లిన గ్రామంలోని భక్తులు

ఆధ్యాత్మిక కేంద్రాల దర్శనం కోసం బయలుదేరిన ఓ బృందంలోని భక్తురాలు ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయింది. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కొందరు భక్తులు శివరాముడు ట్రావెల్స్‌ ద్వారా చార్‌ధామ్‌ యాత్రకు బయలుదేరి వెళ్లారు. వీరిలో గ్రామానికి చెందిన ధర్మాంబ ఒకరు. వీరంతా యమునోత్రి ఆలయం వద్దకు చేరుకునే సరికి ధర్మాంబ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తోటి భక్తులు సపర్యలు చేసేలోగానే ఆమె అంతిమ శ్వాస విడిచారు.

ధర్మాంబ మృతి సమాచారంతో హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు. ఆమె మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మృతదేహాన్ని ఊరికి చేర్చడంలో ట్రావెల్స్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వమే చొరవ తీసుకుని సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

More Telugu News