KCR: సస్పెండ్‌ చేస్తా... టీవీ చర్చా కార్యక్రమాలకు వెళ్లే వారికి సీఎం కేసీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌!

  • పార్టీ తరపున ఎవరూ వెళ్లడానికి వీల్లేదు 
  • ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయి
  • వచ్చేనెలలో మున్సిపల్‌ ఎన్నికలు

అత్యుత్సాహంతో పార్టీ తరపున టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పార్టీ నాయకులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారట. తన ఆదేశాలను ఉల్లంఘించి వ్యవహరిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టు సమాచారం.  

వచ్చే నెలలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నామని, ఇందుకోసం పార్టీ నాయకులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. మున్సిపల్‌ ఎన్నికలను ఎంత వీలైతే అంత వేగంగా పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పూర్తయితే అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

More Telugu News