Sister: చెల్లెలు ఇల్లొదిలిందని... నలుగురు అక్కలూ ఆత్మహత్యా యత్నం.. ఒకరి పరిస్థితి విషమం!

  • మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన
  • ఆరుగురు అమ్మాయిలు ఉన్న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఐదో అమ్మాయి
  • పరువు పోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

తమ చెల్లెలు ఇల్లొదిలి పోయి పరువు తీసిందన్న మనస్తాపంతో నలుగురు అక్కలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఓ ఇంట్లో ఆరుగురు ఆడపిల్లలు ఉండగా, వారెవరికీ ఇంతవరకూ వివాహం కాలేదు. ఈ బుధవారం నుంచి ఐదో అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమె గురించి ఆరా తీయగా, ఓ యువకుడితో కలిసి వెళ్లిపోయినట్టు తెలిసింది.

దీంతో తమకంటే చిన్నమ్మాయి వెళ్లిందంటే, కుటుంబం పరువే పోయినట్టని భావించిన వారు, చిన్న చెల్లిని, తల్లిని ఓ గదిలో ఉంచి గడియపెట్టి, పురుగుల మందు తాగారు. ఆ గదిలో నుంచి కేకలు వస్తుండటంతో గ్రామస్థులు వారిని విడిపించి, నలుగురినీ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News