Tollywood: విజయనిర్మల గారి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా!: పవన్ కల్యాణ్

  • దర్శక-నిర్మాతగా సినీరంగంపై చెరగని ముద్రవేశారు
  • చాలామంది మహిళా దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు
  • ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా

ప్రముఖ నటి, దర్శక-నిర్మాత విజయనిర్మల మరణవార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. నటిగా, దర్శక-నిర్మాతగా ఆమె సినీరంగంపై చెరగని ముద్ర వేశారని వ్యాఖ్యానించారు. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సినిమాలను తెరకెక్కించిన విజయనిర్మల.. ఈ రంగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

విజయనిర్మల గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జనసేనాని చెప్పారు. ఈ సందర్భంగా విజయనిర్మల భర్త సూపర్ స్టార్ కృష్ణ, కుమారుడు నరేశ్ లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

More Telugu News