Dasari: కనిపించకుండా పోయిన దాసరి కోడలు... కేసు నమోదు!

  • ఈ నెల 9న అదృశ్యమై రెండు వారాల తరువాత వచ్చిన ప్రభు
  • అదే రోజు తల్లితో సహా బయటకు వెళ్లిన సుశీల
  • ఆపై కనిపించడం లేదని సుశీల సోదరి ఫిర్యాదు

దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి ప్రభు ఇటీవల అదృశ్యమై మళ్లీ హైదరాబాదులో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. మరోపక్క, దాసరి కోడలు సుశీల, ఆమె తల్లి సావిత్రమ్మ అదృశ్యమైన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ విషయమై సుశీల సోదరి చిత్తూరు జిల్లా పూతలపట్టులో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు హైదరాబాద్ కు వచ్చి వారి కోసం గాలిస్తున్నారు. ఈ నెల 9న దాసరి ప్రభు అదృశ్యం కాగా, రెండు వారాల తరువాత ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ప్రత్యక్షం అయ్యారన్న సంగతి తెలిసిందే. కొంతమంది తనను కిడ్నాప్‌ చేశారని ఓసారి, ముంబై వెళ్లానని మరోసారి, ఇలా పొంతనలేని సమాధానాలను ఆయన చెప్పడంతో, పోలీసులు ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇక ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చిన రోజే, సుశీల, స్వయంగా సావిత్రమ్మను తీసుకెళ్లి, మాసబ్‌ ట్యాంక్‌ లోని ఓ హోటల్‌ లో దించినట్లు సుశీల సోదరి చిన్నమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆపై సోదరి, తల్లి ఇంటికి రాలేదని, వారు ఎక్కడున్నారో తెలియడం లేదని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, హైదరాబాద్ కు వచ్చి, రెండు రోజులుగా  గాలింపు చర్యలు చేపట్టడంతో విషయం వెలుగులోకివచ్చింది.

More Telugu News