sensex: వరుసగా రెండో రోజు లాభాల్లో మార్కెట్లు

  • పవర్, మెటల్ షేర్ల సందడి
  • 157 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 4 శాతం పైగా లాభపడ్డ వేదాంత లిమిటెడ్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. పవర్, మెటల్ షేర్ల అండతో ఈరోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 39,592కి పెరిగింది. నిఫ్టీ 51 పాయింట్లు పుంజుకుని 11,848కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (4.40%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.12%), సన్ ఫార్మా (3.59%), యస్ బ్యాంక్ (2.77%), టాటా స్టీల్ (2.59%).
   
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.12%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.02%), టెక్ మహీంద్రా (-0.87%), భారతి ఎయిర్ టెల్ (-0.85%), మారుతి సుజుకి (-0.68%).

More Telugu News