samanta: 'ఓ బేబీ' చేద్దామని నందినీ రెడ్డికి నేనే చెప్పాను: సమంత

  • 'మిస్ గ్రానీ' కథ నాకు నచ్చింది
  • ఆల్రెడీ 7 భాషల్లో సక్సెస్ అయింది
  • కామెడీతో పాటు ఎమోషన్ ఉంటుంది

తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా సమంత ఒక వెలుగు వెలుగుతోంది. తెలుగులో ఆమె తాజా చిత్రంగా 'ఓ బేబీ' రూపొందింది. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, నిర్మాత సునీత గారు వచ్చి కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' చూపించారు. ఆల్రెడీ ఈ సినిమా 7 భాషల్లో విజయాన్ని సాధించిందని చెప్పారు.

నాకు ఎప్పటి నుంచో పూర్తిస్థాయి హాస్యప్రధానమైన సినిమా ఒకటి చేయాలనే కోరిక వుంది. 'మిస్ గ్రానీ' చూసిన తరువాత ఈ సినిమా రీమేక్ లో తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత నందినీ రెడ్డి గారికి ఇది చేద్దామని చెప్పాను. ఈ కథ చేయడానికి ఆమె ఉత్సాహాన్ని చూపించారు. కామెడీతో పాటు ఎమోషన్ తో కట్టిపడేసే 'ఓ బేబీ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News