TRS: నెలజీతం చెక్కును విరాళంగా కేటీఆర్ కు అందించిన బాల్క సుమన్

  • రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలాల్లో టీఆర్ఎస్ ఆఫీసులు
  • ఈ నెల 24న శంకుస్థాపన
  • మొదలైన నిర్మాణాలు

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. టీఆర్ఎస్ ఆఫీసులు ఇకపై సొంత స్థలాల్లో, సొంత భవనాల్లో కొలువుదీరనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణం షురూ అయింది. ఈ నెల 24న పార్టీ ఆఫీసులకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ టీఆర్ఎస్ పార్టీకి తనవంతు విరాళంగా తన నెలజీతాన్ని అందించారు. నెలజీతం రూ.2,50,000 చెక్కును సుమన్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందించారు. పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం ముందుకొచ్చిన సుమన్ ను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు.

More Telugu News