Mahesh Babu: 'మహర్షి' 50 రోజుల వేడుక .. ముఖ్య అతిథిగా నాని

  • మే 9న విడుదలైన 'మహర్షి'
  • ఈ నెల 27వ తేదీకి 50 రోజులు
  •  28న 50 రోజుల వేడుక   

మహేశ్ బాబు కథానాయకుడిగా .. ఆయన 25వ సినిమాగా 'మహర్షి' తెరకెక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, కథానాయికగా పూజ హెగ్డే నటించింది. మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తూ, ఈ నెల 27వ తేదీతో 50 రోజులను పూర్తి చేసుకోనుంది.

200 కేంద్రాల్లో ఈ సినిమా అర్ధశతదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండటం విశేషం. ఈ నెల 28వ తేదీన ఈ వేడుకను హైదరాబాద్ - శిల్పకళా వేదికలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా నానీని ఆహ్వానించినట్టుగా సమాచారం. అడిగిన వెంటనే నాని అంగీకరించాడట. ఇటు మహేశ్ అభిమానులకు .. అటు నాని ఫ్యాన్స్ కి ఈ నెల 28వ తేదీ పండుగ రోజేనన్నమాట. 

More Telugu News