New Delhi: ఢిల్లీ బీజేపీ నేత భార్యను ఏమార్చిన టక్ టక్ గ్యాంగ్!

  • న్యూఢిల్లీ విపక్ష నేత విజేందర్ గుప్తా భార్య శోభ
  • షాపింగ్ కోసం వెళితే టోకరా
  • బ్యాగ్ కొట్టేసిన గ్యాంగ్

ఢిల్లీ రాష్ట్ర శాసనసభలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు విజేందర్ గుప్తా భార్య శోభా విజేందర్ షాపింగ్ కోసం వెళ్లిన వేళ టక్ టక్ గ్యాంగ్ ఆమెను ఏమార్చి, దొంగతనానికి పాల్పడింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న శోభా, మండీ హౌస్ ప్రాంతానికి కారులో వచ్చారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అటుగా వచ్చి, కారులో నుంచి డీజిల్ పోతోందని చెప్పాడు. దీంతో చూసేందుకు శోభాతోపాటు కారు డ్రైవర్ కిందకు దిగారు. అదే అదనుగా కారులోని ఆమె హ్యాండ్ బాగ్ ను కొట్టేశారు. ఈ ఘటనపై శోభ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశామని, నిందితులు ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News