Nudles: చిన్నారిని ఆసుపత్రి పాలు చేసిన నూడిల్స్!

  • కొడుకును తీసుకెళ్లి బయట నూడిల్స్ తినిపించిన మజూర్
  • నూడుల్స్‌కి ఇచ్చే చట్నీ ఇష్టం కావడంతో తినేసిన ఉస్మాన్
  • తెల్లవారిపాటికి శరీరం మొత్తం నీలంరంగులోకి మారింది
  • బీపీ బాగా పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఉస్మాన్

  ఓ మూడేళ్ల పసివాడు నూడిల్స్‌ను తినడంతో 16 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉండాల్సి వచ్చింది. నూడుల్స్‌తో పాటు ఇచ్చిన చట్నీ కారణంగా చిన్నారికి ఊపిరితిత్తులు పాడయ్యాయని వైద్యులు వెల్లడించారు. హర్యానాకు చెందిన మజూర్ అనే వ్యక్తి తన కొడుకు ఉస్మాన్‌ను తీసుకుని వెళ్లి బయట నూడుల్స్ తినిపించాడు. నూడుల్స్‌తో పాటు ఇచ్చే చట్నీ అంటే ఉస్మాన్‌కు బాగా ఇష్టం కావడంతో అది మొత్తం తినేశాడు.

ఆ రోజు నుంచి ఉస్మాన్ ఆరోగ్యం క్షీణించింది. మరుసటి రోజుకు ఉస్మాన్ శరీరం మొత్తం నీలం రంగులోకి మారడాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఉస్మాన్‌కు బీపీ బాగా పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఊపిరితిత్తులు పాడయ్యాయని గ్రహించిన వైద్యులు 16 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉంచి వైద్యం చేశారు. ప్రస్తుతం ఉస్మాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

More Telugu News