maruthi: మెగా హీరో కొత్త సినిమా లాంచ్

  • మారుతి దర్శకత్వంలో తేజు
  •  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
  •  హిట్ కోసం తేజు వెయిటింగ్    

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా మారుతి 'ప్రతిరోజు పండగే' అనే సినిమా చేయనున్నాడనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. కొంతసేపటి క్రితం ఈ సినిమా హైదరాబాద్ లోని ఒక ఆలయంలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా పేరు వినిపిస్తోంది. త్వరలోనే నటీనటుల .. సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. చాలా గ్యాప్ తరువాత తేజుకి 'చిత్రలహరి'తో ఓ మాదిరి సక్సెస్ లభించింది. ఈ సారి తప్పకుండా సూపర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఇక మారుతికి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమే. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

More Telugu News