Rajasthan: విద్యుత్ తీగలు టెంట్‌పై పడటంతో 14 మంది మృతి.. వందమందికి పైగా గాయాలు

  • బడ్మేర్ గాలి వాన కారణంగా విషాదం
  • సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు
  • విచారణకు ఆదేశించిన రాజస్థాన్ ప్రభుత్వం

విద్యుత్ తీగలు తామున్న టెంట్‌పై పడటంతో 14 మంది చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాజస్థాన్‌లోని బడ్మేర్‌లో గాలివాన కారణంగా విద్యుత్ తీగలు తెగి అక్కడున్న టెంట్‌పై పడటంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

More Telugu News