Rashmi Gautam: తొమ్మిది నెలల పాప ఏం చూపించింది?: కలకలం రేపిన అత్యాచారంపై యాంకర్ రష్మీ గౌతమ్!

  • హన్మకొండలో శిశువుపై హత్యాచారం
  • నిందితుడిని ఉరి తీయాలంటున్న ప్రజలు
  • సోషల్ మీడియాతో తీవ్రంగా స్పందించిన రష్మీ

హన్మకొండలో తీవ్ర కలకలం రేపిన 9 నెలల పాపను హత్యాచారం చేయడంపై ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. నిందితుడిని ఉరి తీయాలన్న డిమాండ్ పెరుగుతున్న వేళ, యాంకర్ రష్మి సోషల్ మీడియా ఖాతాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అత్యాచారానికి గురైన 9 నెల‌ల పాప ఏం బ‌ట్ట‌లు వేసుకుంది? తన అందాలను చూపించిందా? కాళ్లు చూపించిందా? ఏదైనా వివాదంపై తన అభిప్రాయం చెప్పిందా? ఆమె ఏం చేసింది? అంటూ ప్రశ్నించింది. రష్మీ గౌతమ్ అడిగిన ప్రశ్నలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, ఆమెకు మద్దతుగా నిలబడి, ఆ కామాంధుడిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News