MS Dhoni: ధోనీ చెప్పాడు, షమీ పాటించాడు... హ్యాట్రిక్ తో విజయానికి కారణమిదే!

  • నిన్న ఆఫ్గన్ తో మ్యాచ్ లో టెన్షన్
  • చివరి ఓవర్ లో షమీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన ధోనీ
  • యార్కర్ వేయాలని సలహా ఇచ్చిన ధోనీ
  • పాటిస్తూ వరుసగా మూడు వికెట్లు తీసిన షమీ

నిన్న ఆఫ్గనిస్తాన్ తో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ పోరులో చివరి ఓవర్ లో ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ మ్యాచ్ భారత అభిమానులను ఎంతో టెన్షన్ పెట్టింది. పసికూనల చేతిలో ఓటమి తప్పదేమోనని అనిపించింది. నబీ చెలరేగి ఆడుతున్న వేళ చివరి ఓవర్ లో 16 పరుగులు చేస్తే ఆఫ్గన్ గెలుస్తుంది. తొలి బంతికే ఫోర్ వచ్చింది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ లో టెన్షన్. రెండో బంతికి సింగిల్ తీసే అవకాశం వచ్చినా తీయలేదు. ఆ సమయంలో ధోనీ బౌలింగ్ చేస్తున్న మహ్మద్ షమీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనికి ఎలా బౌలింగ్ చేయాలో సలహా ఇచ్చాడు. యార్కర్ వేయాలని అన్నాడు. దీంతో ఫీల్డర్లను మార్చిన షమీ, తరువాతి బంతిని యార్కర్ గా సంధించగా, భారీ షాట్ ఆడబోయిన నబీ, ఆ బంతిని పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. ఆపై మరో రెండు బంతులనూ అదే విధంగా సంధించి మరో రెండు వికెట్లను తీసి హ్యాట్రిక్ సాధించడంతో పాటు ఇండియాను గెలుపు తీరానికి చేర్చాడు. ధోనీ సలహా ఇవ్వడం, షమీ పాటించడం తదితర దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

More Telugu News