Virat Kohli: మైదానంలో అంపైర్ కు రెండు చేతులెత్తి నమస్కరించిన కోహ్లీ... ఫొటో వైరల్!

  • నిన్న ఆఫ్గన్ తో మ్యాచ్
  • తామంతా అపీల్ చేయగా నాటౌట్ అన్న అంపైర్
  • డీఆర్ఎస్ కూడా అదే తేల్చడంతో కోహ్లీ నమస్కారం

టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మైదానంలో అంపైర్ ఎదురుగా నిలబడి రెండు చేతులతో కోహ్లీ నమస్కరిస్తున్నట్టు ఉండటమే ఈ చిత్రాన్ని వైరల్ చేసింది. నిన్న భారత్‌, అఫ్గన్‌ మధ్య మ్యాచ్ జరుగగా, ఛేదనలో భాగంగా హజ్రతుల్లా బ్యాటింగ్‌ చేస్తున్న వేళ, షమీ బౌలింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. షమి వేసిన బంతి హజ్రతుల్లా బ్యాక్‌ ప్యాడ్‌ కి తగిలినట్టుగా గమనించిన ఆటగాళ్లు, అప్పీల్‌ చేయగా, అంపైర్‌ 'నాటౌట్‌' అన్నాడు. దీనిపై కోహ్లీ డీఆర్‌ఎస్‌ కు వెళ్లి విఫలమయ్యాడు. ఆ సమయంలో అంపైర్ వద్దకు వెళ్లిన కోహ్లీ, రెండు చేతులు జోడించి ఏదో మాట్లాడాడు. బహుశా తామంతా ఎల్బీ అనుకున్న బంతిని అంత కరెక్ట్ గా నౌటౌట్ కాదని అంపైర్ గమనించడంతో ఆశ్చర్యానికి గురైన కోహ్లీ, ఆ విధంగా ఓ నమస్కారం చేసి, అతని సునిశిత దృష్టిని అభినందించివుంటాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ దృశ్యం, వైరల్‌ కాగా, ఎవరికి తోచిన మీమ్స్‌ ను వారు పోరస్ట్ చేస్తున్నారు.

More Telugu News