Vijay Sai Reddy: ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం

  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
  • తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్న ఏపీ సర్కారు
  • విజయసాయికి క్యాబినెట్ హోదా!

వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాజా నియామకంతో ఇకపై విజయసాయికి క్యాబినెట్ మంత్రి హోదా లభించనుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి ఇప్పటికే వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

More Telugu News