Andhra Pradesh: గుంటూరు జిల్లా పరిషత్ ‘ఎక్స్ అఫీషియో’ సభ్యుడిగా నారా లోకేశ్!

  • నమోదు చేసుకున్న టీడీపీ నేత
  • మంగళగిరి అసెంబ్లీ, మున్సిపాలిటీ నుంచి నమోదు
  • రేపు సమావేశానికి హాజరుకానున్న లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ గుంటూరు జెడ్పీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదయ్యారు. నారా లోకేశ్ రెండేళ్ల క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీలు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవాలి. ఏ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్సీ తమ పేరును నమోదు చేసుకుంటారో, అక్కడ ఆయనకు ప్రోటోకాల్ వర్తింపజేస్తారు.

ఈ నేపథ్యంలో నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం, మున్సిపాలిటీలో తన పేరును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో ఇకపై లోకేశ్ గుంటూరు జిల్లా పరిషత్ లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగుతారు. కాగా, ఈ నెల 23న అంటే రేపు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా నారా లోకేశ్ కు అధికారులు ఆహ్వానం పంపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

More Telugu News