Andhra Pradesh: చంద్రబాబుకు దోచుకోవాలన్న యావ తప్ప పోలవరం పూర్తిచేయాలన్న సంకల్పం లేదు!: విజయసాయిరెడ్డి

  • తెలంగాణ సొంతంగా కాళేశ్వరం కట్టింది
  • దీన్ని మూడేళ్లలో పూర్తిచేసింది
  • బాబు పోలవరాన్ని సగం కూడా కట్టలేకపోయారు

తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేసిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. దీనివల్ల 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కేంద్రం కావాల్సినన్ని నిధులు ఇచ్చినా గత ఐదేళ్లలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో సగం కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఆయనకు ఎంతసేపూ నిధులు దోచుకోవాలన్న యావే తప్ప ప్రాజెక్టును పూర్తిచేయాలన్న సంకల్పం లేదని అన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News