Andhra Pradesh: నేడు అమరావతికి రానున్న పవన్ కల్యాణ్.. పార్టీ కోర్ కమిటీ కీలక భేటీ!

  • సాయంత్రం 5 గంటలకు గన్నవరం రాక
  • అనంతరం అమరావతికి ప్రయాణం
  • స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించే ఛాన్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లాలోని అమరావతిలో పర్యటించనున్నారు. సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిరాశాజనక ప్రదర్శనపై జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

అనంతరం అక్కడి నుంచి అమరావతికి చేరుకుని జనసేన కోర్ కమిటీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విషయమై కూడా జనసేనాని చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇటీవల జనసేన నేత ఆకుల సత్యనారాయణ సహా పలువురు నేతలు పార్టీపై విమర్శలు గుప్పిస్తుండటంతో దీనిపై కూడా పవన్ కల్యాణ్ స్పందించే అవకాశముందని భావిస్తున్నారు.

More Telugu News