Bollywood: వివాహ వేడుకలో చిందేసిన కత్రినా కైఫ్.. వీడియో వైరల్!

  • డెహ్రాడూన్ లో ఘనంగా వేడుకలు
  • కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఆఫర్
  • మై నేమ్ ఈజ్ షీలా పాటకు నర్తించిన కత్రినా 

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు బాలీవుడ్ లో ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని డెహ్రాడూన్ లో ఓ ధనిక కుటుంబం ఏకంగా రూ.200 కోట్లతో వివాహ వేడుకను జరిపింది. దీన్ని మరపురాని అనుభూతిగా మార్చుకోవాలనుకున్న కుటుంబం బాలీవుడ్ లోని టాప్ స్టార్లను ఆహ్వానించింది.  

ఈ వివాహ వేడుకలో డ్యాన్స్ చేయాల్సిందిగా వీరందరినీ కోరింది. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఆమె డ్యాన్స్ చేసేందుకు అంగీకరించింది. వివాహ వేదిక వద్ద తీస్ మార్ ఖాన్ సినిమాలోని ‘మై నేమ్ ఈజ్ షీలా’ పాటకు చిందేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో 'సూర్యవంశీ' సినిమాలో కత్రినా ప్రస్తుతం నటిస్తోంది.

More Telugu News