Lasith Malinga: నిప్పులు చెరిగిన మలింగ... సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లాండ్ ఆపసోపాలు!

  • ఇంగ్లాండ్ టార్గెట్ 233 రన్స్
  • 144 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకున్న ఆతిథ్య జట్టు
  • మలింగకు 4 వికెట్లు

వెటరన్ పేస్ బౌలర్ లసిత్ మలింగ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ టాపార్డర్ పనిబట్టాడు. 233 పరుగుల కష్ట సాధ్యంకాని లక్ష్యం ఛేదించేందుకు బరిలో దిగిన ఇంగ్లాండ్ ను మలింగ కుదురుకోనివ్వలేదు. 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టాడు. విన్స్, బెయిర్ స్టో, రూట్, బట్లర్ వంటి హేమాహేమీలను పెవిలియన్ చేర్చాడు. ప్రసుత్తం ఇంగ్లాండ్ జట్టు 36 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 14 ఓవర్లలో 79 పరుగులు చేయాలి. ప్రస్తుతం బెన్ స్టోక్స్ 44, మొయిన్ అలీ 4 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News