RTC Bus: బస్సులో కండక్టర్‌తో పాటు మరో ఇద్దరిపై సైకో దాడి

  • మందపల్లి - ముష్టిబండకు వెళుతుండగా ఘటన
  • చితకబాది పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు
  • సైకో నుంచి నాలుగు కత్తులు స్వాధీనం

ఆర్టీసీ బస్సులో ఓ సైకో ప్రయాణికులపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. దీంతో సైకోను ప్రయాణికులంతా కలిసి చితకబాది పోలీసులకు అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందపల్లి నుంచి ముష్టిబండకు బస్సు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సులోకి ఎక్కిన ఓ సైకో లేడీ కండక్టర్‌తో పాటు మరో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రయాణికులంతా కలిసి మూకుమ్మడిగా సైకోను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతని నుంచి నాలుగు కత్తులను సైతం ప్రయాణికులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News