Cricket: లంక భారీ స్కోరు ఆశలను దెబ్బతీసిన ఇంగ్లాండ్ బౌలర్లు

  • శ్రీలంక స్కోరు 38 ఓవర్లలో 5 వికెట్లకు 164
  • అర్ధసెంచరీలు చేజార్చుకున్న ఫెర్నాండో, మెండిస్
  • పోరాడుతున్న మాథ్యూస్

ఆతిథ్య ఇంగ్లాండ్ తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో శ్రీలంక కష్టాల్లో పడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కేవలం 3 పరుగులకే ఓపెనర్లు అవుట్ కాగా, మిడిలార్డర్ లో ఫెర్నాండో (49), మెండిస్ (46)ల పోరాటం కాసేపే కొనసాగింది. రిస్థితి నిలకడగా ఉందన్న తరుణంలో వీరిద్దరూ వెనుదిరగడంతో లంక భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది. 38 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో ఏంజెలో మాథ్యూస్ 40, డిసిల్వా 20 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లెగ్ స్పిన్ అదిల్ రషీద్ 2 వికెట్లు తీశాడు. వోక్స్, ఆర్చర్, మార్క్ వుడ్ తలో వికెట్ సాధించారు.

More Telugu News