Telangana: కాళేశ్వరం ప్రాజెక్టును కళ్లతో కాదు.. మనసుతో చూడండి!: మంత్రి జగదీశ్ రెడ్డి

  • తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ శ్రమించారు
  • ఆయన మదిలో పుట్టిన ఆవిష్కరణే కాళేశ్వరం ప్రాజెక్టు
  • కాంగ్రెస్ మాపై అర్థంలేని విమర్శలు చేస్తోంది

తెలంగాణలో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా శ్రమించారని మంత్రి, టీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ మదిలో పుట్టిన అద్భుత ఆవిష్కరణే కాళేశ్వరం ప్రాజెక్టు అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమపై అర్థం లేని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును కళ్లతో కాకుండా మనసుతో చూడాలనీ, అప్పుడే ప్రాజెక్టు గొప్పతనం అర్థమవుతుందని పేర్కొన్నారు.

More Telugu News