Telangana: తెలంగాణ ప్రజలకు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన కానుక ఇది: ముఖ్యమంత్రి ఫడ్నవిస్

  • కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుంది
  • రికార్డు వేగంతో ప్రాజెక్టును పూర్తి చేశారు
  • ఈ ప్రాజెక్టు వల్ల మాకు కూడా నీళ్లు వస్తాయి

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో పాటు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, ఫడ్నవిస్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు మహారాష్ట్ర ప్రజలు అందించిన కానుక అని చెప్పారు. రికార్డు వేగంతో ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని కితాబునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రకు ఎలాంటి నష్టం లేదని... తమ రాష్ట్రానికి కూడా నీళ్లు వస్తాయని చెప్పారు.

More Telugu News