Telugudesam: ఈరోజు సాయంత్రం అన్ని విషయాలు ప్రకటిస్తా: టీడీపీ ఎంపీ సుజనా చౌదరి

  • టీడీపీని వీడనున్న నలుగురు రాజ్యసభ సభ్యులు
  • ఈ నలుగురిలో సుజానా చౌదరి ఒకరు
  • బీజేపీలో చేరతారా అన్న ప్రశ్నకు స్పందించని సుజనా

టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు ఆ పార్టీ నుంచి బయటకొచ్చే ఉద్దేశంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుని కలిసి ఓ లేఖ అందజేశారు. పార్టీని వీడనున్న వారిలో ఎంపీ సుజనా చౌదరి కూడా ఉన్నారు. ఈ విషయమై తనను పలకరించిన విలేకరులతో సుజనా చౌదరి మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం  ఏడు గంటలకు అన్ని విషయాలు ప్రకటిస్తామని చెప్పారు. బీజేపీలో చేరతారా అన్న ప్రశ్నకు సుజనా చౌదరి సమాధానం చెప్పలేదు.

More Telugu News