Andhra Pradesh: బూరలు, పిన్నులు అమ్ముకుంటున్న పిల్లలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాయం!

  • పెదకొండూరులో ఇద్దరు అమ్మాయిలు
  • పేదరికం కారణంగా బూరలు, పిన్నుల అమ్మకం
  • ట్విట్టర్ లో స్పందించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

గుంటూరు జిల్లాలోని పెదకొండూరులో తాను ఓ వివాహ కార్యక్రమానికి వెళుతుంటే, ఇద్దరు పిల్లలు బూరలు, పిన్నులు అమ్ముకుంటూ కనిపించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వీరిది తుళ్లూరు మండలంలోని పెదపరిమి గ్రామమని చెప్పారు. పేదరికం, ఇంట్లో అధిక సంతానం కారణంగా ఈ పిల్లలు ఇలా అమ్ముకుంటూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. వీరికి బట్టలు, చెప్పులు కొనుక్కోవడానికి కొంత ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్న బడిబాట, అమ్మఒడి పథకాల గురించి ఇద్దరికీ వివరించాననీ, చదువుకుంటే ప్రభుత్వం నగదు ఇస్తుందని చెప్పానని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News