Andhra Pradesh: కాకినాడలో టీడీపీ నేతల రహస్య సమావేశంపై స్పందించిన కాపు నేత తోట త్రిమూర్తులు!

  • కాకినాడలోని హోటల్ లో సమావేశమైన నేతలు
  • బీజేపీలో చేరతారని చక్కర్లు కొట్టిన వార్తలు
  • క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత

టీడీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేశ్ బాబు, బోండా ఉమ, కదిరి బాబూరావు, బడేటి బుజ్జి, మీసాల గీత, వరుపుల రాజా, మాధవ నాయుడు, జ్యోతుల నెహ్రూ, ఈలి నాని ఈరోజు కాకినాడలోని ఓ హోటల్ లో రహస్యంగా సమావేశమైన సంగతి తెలిసిందే. పార్టీ అధిష్ఠానానికి సమాచారం ఇవ్వకుండా వీరు సమావేశం కావడంతో ఈ కాపు నేతలంతా బీజేపీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ నేత తోట త్రిమూర్తులు స్పందించారు. తామంతా టీడీపీలోనే కొనసాగుతామని తోట త్రిమూర్తులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకునేందుకే ఈ సమావేశం నిర్వహించామని స్పష్టం చేశారు. తాము బీజేపీలోకి వెళ్లడం లేదని పునరుద్ఘాటించారు.

More Telugu News