chaitu: చైతూ హీరోగా శేఖర్ కమ్ముల సినిమా ఖరారైపోయింది

  • చైతూ తాజా చిత్రంగా 'వెంకీమామ'
  • తదుపరి సినిమా శేఖర్ కమ్ములతో
  •  సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్    

చైతూ హీరోగా శేఖర్ కమ్ముల ఒక సినిమా చేయనున్నాడనీ, కథానాయికగా సాయిపల్లవి ఎంపిక జరిగిపోయిందనే టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమేననే విషయం తాజాగా స్పష్టమైపోయింది. శేఖర్ కమ్ముల - చైతూ కాంబినేషన్ లోని సినిమా నిజమేనంటూ ఒక ప్రకటన వచ్చేసింది. నాయికగా సాయిపల్లవినే ఖరారు చేసేశారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగును సెప్టెంబర్ మొదటివారంలో మొదలెట్టనున్నారు. డిసెంబర్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం చైతూ 'వెంకీమామ' సినిమా చేస్తున్నాడు. అలాగే శేఖర్ కమ్ముల కూడా కొత్త ఆర్టిస్టులతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత, శేఖర్ కమ్ముల - చైతూ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ములతో సాయిపల్లవి చేస్తోన్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. 

More Telugu News