viajyasai reddy: నా జీవితంలో ఇదొక మధుర జ్ఞాపకం: విజయసాయిరెడ్డి

  • పార్లమెంటు ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం
  • విజయసాయిని ప్రత్యేకంగా పలకరించిన మోదీ
  • సంతోషాన్ని వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి

పార్లమెంటు లైబ్రరీ హాల్ సమీపంలో నిన్న ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ బయటకు వచ్చారు. ఈ సమావేశానికి పార్టీల అధ్యక్షులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేకపోవడంతో... వైసీపీ ఎంపీలంతా బయట ఉన్న లాంజ్ లో కూర్చున్నారు. మోదీ బయటకు వస్తుండడాన్ని చూసిన వైసీపీ ఎంపీలు గౌరవ సూచకంగా లేచి నిల్చున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిని చూసిన మోదీ...  'హాయ్ విజయ్ గారూ' అంటూ ప్రత్యేకంగా పలకరించారు.
 
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విజయసాయిరెడ్డి పంచుకున్నారు. జగన్ కోసం నిరీక్షిస్తున్న తనను చూసి... తన వైపు అడుగులు వేసి, తనతో మోదీ కరచాలనం చేశారని తెలిపారు. తన జీవితంలో ఇదొక మధుర జ్ఞాపకమని చెప్పారు.

More Telugu News