delhi: ఢిల్లీలో మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్

  • అఖిలపక్ష సమావేశానికి హాజరైన జగన్
  • విమానాశ్రయం నుంచి పార్లమెంటు వరకు మెట్రోలో పయనం
  • మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్ట సభలకు (పార్లమెంటు, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

మరోవైపు ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన జగన్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పార్లమెంటు వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు.

More Telugu News