Uttar Pradesh: పెళ్లికి వెళ్లివస్తున్న మినీవ్యానును ఢీకొట్టిన లారీ.. 8 మంది దుర్మరణం!

  • మరో 12 మందికి తీవ్రగాయాలు
  • యూపీలోని సంభాల్ జిల్లాలో ఘటన
  • ప్రమాదతీవ్రతకు నుజ్జునుజ్జయిన మినీ వ్యాను

ఉత్తరప్రదేశ్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని సంభాల్ జిల్లాలో పెళ్లికి వెళ్లి వస్తున్న ఓ మినీ వ్యాన్ సరుకులు తరలిస్తున్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. వివాహానికి వెళ్లి వస్తున్న మినీ వ్యాను అలీగఢ్-అగ్రా రహదారిపై అటుగా వెళుతున్న లారీని ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాను నుజ్జునుజ్జు అయిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

More Telugu News