Virat Kohli: కోహ్లీతో నటి ఊర్వశీ రౌతాలా... అనుష్క ఎక్కడుందని అడుగుతున్న నెటిజన్లు!

  • పాక్ తో మ్యాచ్ తరువాత కోహ్లీ విగ్రహంతో ఫొటో
  • షేర్ చేయడంతో వైరల్
  • కామెంట్లతో నిండిపోయిన సోషల్ మీడియా

ఈ ఫొటో చూశారా? భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న నటి ఊర్వశీ రౌతాలా. ఊర్వశి ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగానే తెగ వైరల్ అయింది. పలువురు ఈ ఫొటోపై స్పందించారు కూడా. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం తరువాత ఊర్వశి ఈ చిత్రాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకుంది. స్వతహాగానే క్రికెట్ అంటే అభిమానాన్ని చూపే ఊర్వశి, ఇలా ఓ చిత్రాన్ని పెట్టడంతో, ఆ ఫొటోను అనుష్క శర్మకు జోడిస్తూ, వేలాది కామెంట్లు వచ్చాయి.

"అనుష్కా నువ్వు ఎక్కడ ఉన్నావో?" అని ఒకరు "నీ ఫోన్ చూసుకో" అని ఇంకొకరు, అనుష్కకు దిగులు ప్రారంభమైందని మరొకరు ఇలా కామెంట్లతో వీరి సోషల్ మీడియా ఖాతాలు నిండిపోతున్నాయి. ఇక అసలు వాస్తవం ఏంటో తెలుసా? ఊర్వశి కౌగిలించుకున్నది విరాట్ కోహ్లీని కాదు. ఆయన మైనపు విగ్రహాన్ని మాత్రమే. విగ్రహాన్ని కౌగిలించుకున్న ఊర్వశి, దాని బ్యాక్ గ్రౌండ్ ను మార్ఫింగ్ చేసి ఫొటోను పోస్ట్ చేసింది. దీనిపైనే ఈ రగడంతా. అదీ సంగతి.

More Telugu News