balakrishna: బాలకృష్ణ సినిమాలో మళ్లీ ఛాన్స్ కొట్టేసింది

  • బాలకృష్ణ తాజా చిత్రానికి సన్నాహాలు
  • బాలకృష్ణతో మూడు సినిమాలు చేసిన శ్రియ
  •  మరో నాయిక కోసం అన్వేషణ  

బాలకృష్ణ కథానాయకుడిగా ఒక సినిమాను రూపొందించడానికి కేఎస్ రవికుమార్ సన్నాహాలు చేస్తున్నాడు. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'క్రాంతి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉందని చెప్పారు. అప్పటి నుంచి ఆ ఛాన్స్ ఎవరికి దక్కునుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వెళుతోంది.

ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా శ్రియను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. గతంలో బాలకృష్ణ సరసన నాయికగా ఆమె మూడు సినిమాల్లో చేసింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలోను ఛాన్స్ కొట్టేయడం విశేషం. మరో కథానాయికగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయట. మరి ఆ ఛాన్స్ ఏ నాయికకి దక్కుతుందో చూడాలి. 

More Telugu News