Director: మణిరత్నంకు గుండెపోటు వార్తలను నమ్మొద్దంటున్న సన్నిహితులు

  • ఈ వదంతులను నమ్మొద్దు
  • సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లారు
  • మణిరత్నం సన్నిహితుల ప్రకటన

ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు వచ్చినట్టు వస్తున్న వార్తలను ఆయన సన్నిహితులు ఖండించారు. ఈ వదంతులను నమ్మొద్దని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు. ఈరోజు ఉదయాన్నే ఆయన తన కార్యాలయానికి వెళ్లినట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గతంలో కూడా మణిరత్నం ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. మణిరత్నంకు గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నట్టు ప్రచారం జరిగింది.

More Telugu News