Andhra Pradesh: జగన్ అంటే నాకు భయం లేదు.. భయపడతానో, లేదో 6 నెలల తర్వాత చూస్తారు!: జేసీ దివాకర్ రెడ్డి

  • బీజేపీలో చేరాలని ఆఫర్ వచ్చింది
  • అయితే ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు
  • జగన్ ఢిల్లీలో హుందాగా వ్యవహరించారు
  • అనంతపురంలో మీడియాతో టీడీపీ నేత

బీజేపీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు తనను ఆహ్వానించారని టీడీపీ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నీతిఆయోగ్ సమావేశం నేపథ్యంలో ఢిల్లీలో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ చాలా హుందాగా ప్రవర్తించారని జేసీ కితాబిచ్చారు. పులివెందుల నుంచి వచ్చిన జగన్ ఇలా ఉంటాడని తాము అనుకోలేదన్నారు.

అనంతపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. జగన్ కు భయపడి ఆయన్ను పొగడటం లేదనీ, ఆయన తీరు నచ్చే ప్రశంసిస్తున్నానని జేసీ అన్నారు. తాను జగన్ కు భయపడుతున్నానో, లేదో 6 నెలల తర్వాత చూస్తారని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షించుకుంటారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

More Telugu News