Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ!

  • గవర్నర్ ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానం
  • సమావేశం సందర్భంగా స్పీకర్ తో టీడీపీ సభ్యుల భేటీ
  • టీడీఎల్పీకి ఆఫీసును కేటాయించాలని విజ్ఞప్తి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలుసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో టీడీఎల్పీకి కార్యాలయాన్ని కేటాయించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన స్పీకర్ తమ్మినేని వీలైనంత త్వరగా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News