Andhra Pradesh: ఆ జర్నలిస్ట్ ఓ తల్లికే పుట్టి ఉంటాడు.. ఇప్పుడు నన్ను బాధపెడుతున్నాడు!: రేణుదేశాయ్

  • ఉత్తరాదిన పిల్లలతో రేణుదేశాయ్ టూర్
  • పవన్ పిల్లలతో మాజీ భార్య అని టైటిల్ పెట్టిన వెబ్ సైట్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన రేణుదేశాయ్

ప్రముఖ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈరోజు మీడియా వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. రేణుదేశాయ్ ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీనగర్, జమ్మూ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ వార్తను ఓ వైబ్ సైట్ కవర్ చేసింది.  ఆ వార్తలో ‘పవన్ కల్యాణ్ పిల్లలతో ఆయన మాజీ భార్య రేణుదేశాయ్’ అని టైటిల్ పెట్టాడు.

దీనిపై రేణుదేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడే ఎవరో నాకు ఇది పంపించారు. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఓ తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఎలా బాధ పెడుతున్నాడు ఇప్పుడు?’ అని రేణుదేశాయ్ ఫేస్ బుక్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News