Sangareddy District: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఫోన్ కాల్!

  • తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
  • కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి
  • రాజగోపాల్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న ఆయన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి మరోమారు వార్తల్లో నిలిచారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కోమటిరెడ్డి ఫోన్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి, ఆ పదవి కోసం ఈ వ్యాఖ్యలు చేశారా? లేక కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళతారా? అన్న విషయాలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.

More Telugu News