Andhra Pradesh: రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాన్ని మార్చేస్తాం: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై నియంత్రణ తీసుకొస్తాం
  • నూతన విద్యావిధానంపై అధ్యయనం చేస్తాం
  • ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు కొనసాగేలా చర్యలు

రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల ముఖచిత్రాన్ని మార్చేస్తామని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై నియంత్రణ తీసుకొస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మరోమారు స్పష్టం చేశారు. నూతన విద్యావిధానంపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని, త్వరలో డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫేకషన్ జరుగుతుందని తెలిపారు.

More Telugu News