Andhra Pradesh: విజయవాడ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం!: ఏపీ మంత్రులు ధర్మాన, వెల్లంపల్లి

  • దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి
  • డిసెంబర్ 31 నాటికల్లా పూర్తిచేస్తాం
  • ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రులు

విజయవాడ వాసుల చిరకాల స్వప్నం అయిన దుర్గగుడి ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేశామని ఏపీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఈ ఫ్లైఓవర్ ను పూర్తి చేస్తామని ప్రకటించారు. విజయవాడ వాసులకు న్యూఇయర్ బహుమతిగా ఫ్లైఓవర్ ను అందిస్తామని చెప్పారు. ఈరోజు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు డిజైన్ ను మార్చడం కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిందని వ్యాఖ్యానించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.10 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

More Telugu News