Cricket: వర్షం కారణంగా నిలిచిపోయిన దక్షిణాఫ్రికా-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్

  • వరల్డ్ కప్ ను వీడని వరుణుడు
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • ఆప్ఘనిస్థాన్ స్కోరు 20 ఓవర్లలో 69/2

ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ లో మరో మ్యాచ్ పై వరుణుడు ప్రభావం చూపాడు. కార్డిఫ్ లో దక్షిణాఫ్రికా, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలవడంతో ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి ఓపెనర్ నూర్ అలీ జాద్రాన్ 32, హస్మతుల్లా షాహిదీ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు, ఓపెనర్ హజ్మతుల్లా జాజాయ్ 22, రహ్మత్ షా 6 పరుగులు చేసి అవుటయ్యారు. సఫారీ బౌలర్లలో రబాడా, మోరిస్ చెరో వికెట్ సాధించారు.

More Telugu News