Srikanth: స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న హీరో శ్రీకాంత్

  • విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి నియామక కార్యక్రమం
  • కిరణ్ కుమార్ శర్మకు బాధ్యతలు
  • హాజరైన ప్రముఖులు

ఎంతో ప్రఖ్యాతి చెందిన విశాఖ శారదా పీఠంలో ఉత్తరాధికారి బాధ్యతల అప్పగింతల కార్యక్రమం ఘనంగా మొదలైంది. శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. స్వరూపానంద ముఖ్య శిష్యుడు కిరణ్ కుమార్ శర్మ బాలస్వామిని శారదా పీఠం ఉత్తరాధికారిగా నియమిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమానికి ఇవాళ అనేకమంది ప్రముఖులతో పాటు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చానని, ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు శ్రీకాంత్ చెప్పారు. సినిమా షూటింగ్ ల ఒత్తిడి వల్ల ఇవాళ ఒక్కరోజు మాత్రమే శారదా పీఠంలో ఉంటానని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ తో పాటు ఆయన అర్ధాంగి ఊహ కూడా విచ్చేశారు.

More Telugu News