Andhra Pradesh: ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ విందు రాజకీయం.. హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి!

  • ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి
  • వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం
  • ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విందు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈరోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జగన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విందును ఏర్పాటు చేసిన జగన్.. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిని ఆహ్వానించారు.

ఈ ఆహ్వానాన్ని మన్నించిన కుమారస్వామి జగన్ ఇంటిలో జరుగుతున్న విందు భేటీకి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో ఏపీ, కర్ణాటకకు లబ్ధి చేకూర్చే అంశాలపై ఇరువురు నేతలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని వైసీపీ వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో ఇరురాష్ట్రాల సీఎంలు కలసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారని పేర్కొన్నాయి.

More Telugu News