Karnataka: సహజీవనానికి నిరాకరించిందని.. 50 ఏళ్ల మహిళను కాల్చిచంపిన అరవై ఏళ్ల వృద్ధుడు

  • భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న మహిళ
  • సహజీవనం చేద్దామని ప్రతిపాదన
  • అంగీకరించకపోవడంతో హత్య

తనతో కలిసి జీవించేందుకు నిరాకరించిందన్న కోపంతో 50 ఏళ్ల మహిళను ఓ వృద్ధుడు కాల్చి చంపాడు. కేరళలోని కొడుగు జిల్లాలో ఉన్న బాళలె గ్రామంలో జరిగిందీ దారుణం. స్థానికంగా నివసించే ఆశా కావేరమ్మ ఉపాధ్యాయురాలు. భర్త మృతి చెందడంతో ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల జగదీశ్ భార్యను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరం ఒంటరి వాళ్లం కాబట్టి కలిసి ఉందామంటూ జగదీశ్ ఆమె వద్ద సహజీవనం ప్రస్తావన తీసుకొచ్చాడు.

అందుకు ఆమె నిరాకరించడాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో రెండేళ్లుగా ఆమెను వేధిస్తున్నాడు. శుక్రవారం స్కూలుకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చున్న కావేరమ్మను రివాల్వర్‌తో కాల్చి చంపాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కాగా, కావేరమ్మను కాల్చి చంపిన నిందితుడు సమీపంలోని కాఫీ తోటలోకి వెళ్లి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News