Cricket: జో రూట్ సెంచరీ... 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్

  • 33.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఆతిథ్య జట్టు
  • రాణించిన బెయిర్ స్టో, వోక్స్
  • విండీస్ 212 పరుగులు 

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా సౌతాంప్టన్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ అన్ని రంగాల్లో రాణించి, వెస్టిండీస్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. విండీస్ నిర్దేశించిన 213 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించింది. ఇంగ్లాండ్ రెగ్యులర్ ఓపెనర్ జాసన్ రాయ్ గాయపడడంతో ఇన్నింగ్స్ ఆరంభించిన స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

రూట్ సరిగ్గా 100 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో 45, వన్ డౌన్ లో వచ్చిన క్రిస్ వోక్స్ 40 పరుగులతో రాణించారు. అంతకుముందు, ఇంగ్లాండ్ టాస్ గెలిచి విండస్ కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ 212 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసిన క్రిస్ గేల్ రెండు ఓవర్లు వేసి ఎంతో పొదుపుగా పరుగులిచ్చాడు. అయితే బౌలింగ్ సందర్భంగా గేల్ హావభావాలు ప్రేక్షకులను అలరించాయి.

More Telugu News