pulwama: కాల్పులతో దద్దరిల్లిన పుల్వామా

  • అవంతిపొరా ప్రాంతంలో ఎదురుకాల్పులు
  • ఇద్దరు ఉగ్రవాదుల హతం
  • ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో తుపాకులు గర్జించాయి. జిల్లాలోని అవంతిపొరా పరిధిలో ఉన్న బ్రాబందిన ప్రాంతంలో ఈరోజు జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు గాలింపు చేపట్టారు. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులను జవాన్లు కాల్చి చంపారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన టెర్రరిస్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News